UNO: ఏసీలు, ఎస్కలేటర్ల వినియోగం తగ్గించాలి.. ఐక్యరాజ్యసమితి ఆఫీసులో కొత్త నిబంధనలు
- నిధుల లేమిలో ఐక్యరాజ్యసమితి
- సభ్య దేశాలు తమ వాటా నిధులివ్వకపోవడంతో సమస్య
- నిధులు అందకపోతే ఉద్యోగుల జీతాలు ఇవ్వలేము: సెక్రెటరీ జనరల్
ఐక్య రాజ్య సమితి నిధుల లేమి సమస్య నుంచి గట్టెక్కడానికి పొదుపు వ్యూహాలను అమల్లోకి తెస్తోంది. ఇందులో భాగంగా ఏసీలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్ ల వాడకాన్ని తగ్గించాలని తన ఉద్యోగులకు సూచించింది. కొత్తగా ఉద్యోగుల నియామకాల సంఖ్యను కూడా తగ్గించింది. నిధుల సమస్య తీరేవరకు ఈ నిబంధనలు అమలు చేస్తామని సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. ‘గత పదేళ్లలో ఇంతటి గడ్డు పరిస్థితిని చవిచూడలేదు’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు తమ వాటా ప్రకారం నిధులు చెల్లించకపోవడంతో సమస్య ఉత్పన్నమయిందని అన్నారు. 65 సభ్యదేశాలు 1.38 బిలియన్ డాలర్ల వరకు సమితికి బకాయి పడ్డారు. ఈ బకాయిలు చెల్లించకపోతే.. ఉద్యోగులకు జీతభత్యాలు కూడా చెల్లించలేమంటూ సెక్రెటరీ జనరల్ సభ్యదేశాలకు లేఖలు కూడా రాశారు.
ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు తమ వాటా ప్రకారం నిధులు చెల్లించకపోవడంతో సమస్య ఉత్పన్నమయిందని అన్నారు. 65 సభ్యదేశాలు 1.38 బిలియన్ డాలర్ల వరకు సమితికి బకాయి పడ్డారు. ఈ బకాయిలు చెల్లించకపోతే.. ఉద్యోగులకు జీతభత్యాలు కూడా చెల్లించలేమంటూ సెక్రెటరీ జనరల్ సభ్యదేశాలకు లేఖలు కూడా రాశారు.