East Godavari District: కొనసాగుతున్న బోటు వెలికితీత చర్యలు.. లంగర్లకు చిక్కిన బలమైన వస్తువు!

  • నది లోపలికి పంపిన లంగర్లకు తాకిన బలమైన వస్తువు
  • దీనిని బయటకు లాగుతోన్న ధర్మాడి సత్యం బృందం
  • మునిగిన బోటును సాయంత్రంలోగా బయటకు తీస్తాం అంటున్న బృందం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును  వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. బోటును వెలికితీసేందుకు నది లోపలికి పంపిన లంగర్లకు బలమైన వస్తువు తగిలింది. ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం ఈ వస్తువును బయటకు లాగుతోంది. ఆ వస్తువు మునిగిపోయిన బోటు అయివుంటుందని భావిస్తున్నారు. మునిగిపోయిన బోటును సాయంత్రంలోగా బయటకు తీస్తామని బృందంలోని సభ్యులు చెబుతున్నారు.

More Telugu News