chidambaram: ఈడీ కేసులో చిదంబరం మరోసారి అరెస్టు

  • ఇప్పటికే తిహార్‌ జైల్లో ఉన్న మాజీ ఆర్థిక మంత్రి
  • జైల్లోనే ఈ రోజు విచారణ జరిపిన ఈడీ అధికారులు
  • అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటన

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఇప్పటికే తిహార్‌ జైల్లో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఈడీ అధికారులు ఈ రోజు అరెస్టు చేశారు. ఈ కేసులో నగదు అక్రమ లావాదేవీలకు సంబంధించి చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఈడీ అధికారులకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు ఈడీ అధికారులు ఈ ఉదయాన్నే తిహార్ జైలుకు చేరుకుని దాదాపు గంటపాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చూపించారు.

More Telugu News