అయోధ్యపై ఈ రోజుతో వాదనలు ముగుస్తాయి: సుప్రీం చీఫ్ జస్టిస్
- కేసు విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
- ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నేతృత్వం
- నవంబరు 17లోగా తీర్పు వెలువడే అవకాశం
నెలరోజులుగా పలు వర్గాల వాద, ప్రతివాదనలను ధర్మాసనం రికార్డు చేస్తోంది. నవంబరు 17వ తేదీన చీఫ్ జస్టిస్ పదవీ విరమణ చేస్తున్నారు. ఈ కేసుకు వీలైనంత వేగంగా ముగింపు పలకాలని ఎపెక్స్ కోర్టు భావిస్తున్నందున ఆయన పదవీ విరమణ చేసేలోగా తీర్పు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.