పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు.. సాహసం చేసిన అరుణాచల్ప్రదేశ్ సీఎం
- 122 కిలోమీటర్లు బైక్పై ప్రయాణించిన సీఎం
- రాష్ట్రం వైపు పర్యాటకులను ఆకర్షించేందుకే
- 8 గంటలకు మొదలై 10:30 గంటలకు ముగిసిన ప్రయాణం
ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు యుంకియాంగ్ నుంచి తన ప్రయాణం మొదలైందని, 10:30 గంటలకు పాసిఘాట్ విమానాశ్రయానికి చేరుకున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. పెమాఖండా బైక్ రైడింగ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.