Tamilnadu: ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోనంటున్నాడు... పోలీసులను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారి కుమార్తె!

  • కాలేజీ రోజుల నుంచే యువకుడితో పరిచయం
  • ప్రేమిస్తున్నానని, మొహం చాటేసిన యువకుడు
  • సీరియస్ గా తీసుకున్న డీసీపీ

తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన చెన్నై, విరుగంబాక్కంలో జరిగింది. వివరాల్లోకి వెళితే...

ఇక్కడి ఓ అపార్టుమెంట్ లో నివసిస్తున్న ఐఏఎస్ అధికారి కుమార్తె (20), అన్నా నగర్ లోని ఓ స్కూల్ లో ఇంటర్ వరకూ చదివింది. చదువుతున్న సమయంలోనే ఇర్ఫాన్ (21) అనే విద్యార్థి ఆమెకు పరిచయం అయ్యాడు. చదువుకుంటున్న సమయం నుంచే వారిద్దరి మధ్యా మొదలైన స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఇర్ఫాన్ చెబితే, ఆమె నమ్మింది.

లెదర్ గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్న ఇర్ఫాన్, ఆపై పెళ్లికి నిరాకరించాడు. అతను తనను మోసం చేశాడని చెబుతూ, బాధితురాలు టీ-నగర్ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ ను ఆశ్రయించింది. హై ప్రొఫైల్ కేసు కావడంతో, వెంటనే ఇర్ఫాన్ ను పిలిచి విచారించిన అశోక్ కుమార్, ఈ కేసు విషయంలో వడపళని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచిస్తూ, కేసును విచారించాలని స్టేషన్ సీఐకి ఉత్తర్వులిచ్చారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ పై భారత శిక్షాస్మృతి సెక్షన్ 417, 420, 406, 506 (1)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరుపుతున్నారు.

More Telugu News