Nobel Prize: సతీసమేతంగా నోబెల్ కు ఎంపికైన ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ

  • ఎస్తర్ డఫ్లోతో కలిసి నోబెల్ కు ఎంపికైన అభిజిత్ బెనర్జీ
  • ఆర్థికశాస్త్రంలో మైఖేల్ క్రెమెర్ కూ నోబెల్
  • సామాజిక ఆర్థిక శాస్త్రంలో కృషికి గుర్తింపు

ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యాడు. 2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరిద్దరే కాకుండా మైఖేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు. ప్రపంచ పేదరికాన్ని కనిష్ట స్థాయికి తగ్గించే అంశంలో ఈ త్రయం పరిశోధనాత్మక దృక్పథంతో పలు సిద్ధాంతాలకు రూపకల్పన చేసింది. వీరి కృషికి గుర్తింపుగా నోబెల్ పురస్కారం వరించింది.

More Telugu News