Chiranjeevi: చిరంజీవి గారు, మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను మాకు పంచుతూ ఉండాలి: జగన్

  • జగన్ నివాసానికి సతీమణితో కలసి వెళ్లిన చిరంజీవి
  • ఆత్మీయ స్వాగతం పలికిన జగన్ దంపతులు
  • 'సైరా'తో ఆత్మీయ సమావేశం జరిగిందన్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. తన భార్య సురేఖతో కలసి వచ్చిన చిరంజీవికి జగన్ దంపతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకుని, విందు చేశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా జగన్ పంచుకున్నారు. 'సైరా'తో చాలా ఆత్మీయ సమావేశం జరిగిందని చెప్పారు. 'చిరంజీవి గారు మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను, నవ్వులను మాకు పంచుతూ ఉండాలి' అంటూ ఆకాంక్షించారు.

More Telugu News