Uttar Pradesh: యూపీలో బీజేపీ నేత కాల్చివేత.. వారం వ్యవధిలో ముగ్గురి హత్య

  • బీజేపీ కార్పొరేటర్‌ను కాల్చి చంపిన దుండగులు
  • ఈ వారంలో మూడో హత్య
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు

ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌ జిల్లా దేవ్‌బంద్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ ధారాసింగ్ (47) దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఆయనను అత్యంత సమీపం నుంచి తుపాకితో కాల్చి చంపారు. ధారాసింగ్ స్థానికంగా ఉండే ఓ షుగర్ ఫ్యాక్టరీలో సెక్టార్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ఆయన హత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, యూపీలో బీజేపీ నేతలు వరుస హత్యలకు గురవుతున్నారు. ధారాసింగ్ హత్య ఈ వారంలోనే మూడోది కావడం గమనార్హం.

More Telugu News