TRS: టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం చారిత్రక తప్పిదం: కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్

  • హుజూర్ నగర్ ఉపఎన్నికపై స్పందించిన శ్రవణ్
  • టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం కరెక్టు కాదు
  • సీపీఐలో కూడా డొల్లతనం వచ్చిందేమో

త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం కొంత తప్పుడు నిర్ణయం అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కమ్యూనిస్టులు అంటే  సమాజంలో ఎక్కడ చిన్న తప్పు జరిగినా పెద్ద ఎత్తున పోరాడే వాళ్లు, కార్మికులకు అండగా నిలిచే వాళ్లు, అటువంటి వాళ్లు టీఎస్సార్టీసీ ఉద్యోగులను తీసేస్తున్నామన్న అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం దారుణమని అన్నారు. ఈ విషయమై ఆలోచిస్తే సీపీఐలో కూడా డొల్లతనం వచ్చిందేమోనని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు.

More Telugu News