Hyderabad: లంచం కింద డైమండ్ నెక్లెస్.. మహిళా డ్రగ్ ఇన్ స్పెక్టర్ అరెస్టు!

  • హైదరాబాద్ లో సంఘటన
  • డైమండ్ నెక్లెస్ డిమాండ్ చేసిన అధికారిణి
  • స్పై కెమెరాతో దృశ్యాల చిత్రీకరణ 

హైదరాబాద్ లోని ఓ బ్లడ్ బ్యాంక్ అనుమతి కోసం లంచంగా డైమండ్ నెక్లెస్ కోరిన మహిళా డ్రగ్ ఇన్ స్పెక్టర్ బండారం బయటపడింది. లంచం కింద లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ తనకు ఇవ్వాలని కోరిన డ్రగ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి ఓ జ్యుయలరీ షాపులో లక్ష్మీతో కలిసి బ్లడ్ బ్యాంక్ యజమాని షాపింగ్ చేశారు. షాపింగ్ కు సంబంధించిన దృశ్యాలను స్పై కెమెరాతో చిత్రీకరించారు. ఆ నెక్లెస్ ను ఇవ్వడానికి లక్ష్మి నివాసానికి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వెళ్లారు. ఈ నెక్లెస్ ను ఆమె తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్లి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కాగా, షాపింగ్ నకు సంబంధించిన దృశ్యాల సీడీ ఏసీబీ అధికారుల వద్ద ఉంది. గతంలో కూడా ఇదే బ్లడ్ బ్యాంక్ నుంచి రూ.50 వేలు ఆమె లంచంగా తీసుకున్నట్టు సమాచారం. మళ్లీ, ఇప్పుడు కూడా లంచం కింద డైమండ్ నెక్లెస్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, ఏసీబీకి బ్లడ్ బ్యాంక్ యజమాని ఫిర్యాదు చేశారు.

More Telugu News