Mary Kom: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నుంచి మేరీకోమ్ ఔట్!

  • రష్యాలో కొనసాగుతున్న బాక్సింగ్ ఛాంపియన్ షిప్
  • కాంస్య పతకంతో సరిపెట్టుకున్న మేరీకోమ్
  • టర్కీ బాక్సర్ చేతిలో ఓటమి

బాక్సింగులో ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన భారత బాక్సర్ మేరీకోమ్ కు ఈసారి తీవ్ర నిరాశ ఎదురైంది. రష్యాలోని ఉలాన్ ఉదెలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మేరీకోమ్ ఇప్పుడు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ లో టర్కీ బాక్సర్ బ్యూస్ నాజ్ కేరిరోగ్లు చేతిలో (51 కిలోల విభాగంలో) 1-4 తేడాతో ఓడిపోయి, బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నుంచి వెనుదిరిగింది.

మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంగ్రిట్ వాలెన్సియాపై మేరీ కోమ్  5-0 తేడాతో గెలుపొందింది. మరోవైపు, ఇదే ఛాంపియన్ షిప్ లో భారత మహిళా బాక్సర్లు లోవ్లినా బోర్గోహైన్ (69 కేజీల విభాగం), జమున బోరో (54 కేజీల విభాగం), మంజు రాణి (48 కేజీల విభాగం) సెమీఫైనల్స్ లో తమ ప్రత్యర్థులతో తలబడనున్నారు. 

More Telugu News