Tsrtc: టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నాం: ఏపీఎస్సార్టీసీ జేఏసీ

  • ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతాం
  • రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల వద్ద  ఆందోళన చేపడతాం
  • టీ సర్కార్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలి

తెలంగాణలో వారం రోజులుగా టీఎస్సార్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీఎస్సార్టీసీ కార్మికులకు మద్దతుగా ఏపీఎస్సార్టీసీ జేఏసీ మద్దతు తెలుపుతూ ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. టీఎస్సార్టీసీ సమ్మెకు తమ ఉద్యోగుల పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల వద్ద మొదటి దశగా ఆందోళన చేపడతామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని ఏపీఎస్సార్టీసీ జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు.  

  • Loading...

More Telugu News