Mahabalipuram: సాంస్కృతిక కళా ప్రదర్శనలు వీక్షించిన మోదీ, జిన్ పింగ్

  • భారత్ పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు
  • మహాబలిపురం సముద్ర తీర ఆలయంలో మోదీ, పింగ్  
  • చెన్నైకి చెందిన కళాక్షేత్ర విద్యార్థుల ప్రదర్శన

రెండు రోజుల అనధికార పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ఆయన మహాబలిపురం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహాబలిపురం సముద్ర తీర ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలను ప్రధాని మోదీ, జిన్ పింగ్ వీక్షిస్తున్నారు. చెన్నైకి చెందిన కళాక్షేత్ర విద్యార్థులు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అంతకుముందు, చారిత్రక కట్టడాలను మోదీ,జిన్ పింగ్ వీక్షించారు. మహాబలిపురంలోని ఆలయాల ప్రత్యేకత గురించి, రాతి శిల్పకళా కట్టడాలు, ఏకశిలా కట్టడాల విశిష్టతను, కృష్ణుడి వెన్నముద్ద శిలను జిన్ పింగ్ కు మోదీ వివరించారు.

More Telugu News