Andhra Pradesh: ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం

  • ప్రభుత్వ శాఖల్లో కొనుగోళ్లు, సేవలకు ఆన్ లైన్ టెండర్లు
  • కొత్త విధానం రూపకల్పన
  • జనవరి 1 నుంచి అమలు చేసేలా కార్యాచరణ

సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై అధికారులు కార్యాచరణను ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో కొనుగోళ్లు, సేవలకు ఆన్ లైన్ లో టెండర్లు పిలిచేలా కొత్త విధానం రూపకల్పన చేశారు. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలు చేసేలా కార్యాచరణకు దిగనుంది. ఇకపై ప్రభుత్వ కొనుగోళ్లన్నీ ఈ-ప్లాట్ ఫాం వేదికగానే జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, అన్ని ప్రభుత్వ శాఖల కొనుగోళ్లకు ఏకరూప విధానాన్ని ప్రభుత్వం రూపొందించనుంది. ప్రతి ఏటా సామగ్రి కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు, సేవలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. ప్రస్తుతం ఇ-ప్రొక్యూర్ మెంట్ లో రూ.3,181 కోట్ల మేర కొనుగోలు చేస్తున్నట్టు, టెండర్లు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నట్టు, నాసిరకం సామగ్రి సరఫరా అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. కొనుగోళ్లు, చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్టు ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఇ-ప్రొక్యూర్ మెంట్ విధానాన్ని అమలు చేయనుంది.

More Telugu News