Onions: ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • ఆకాశాన్నంటిని ఉల్లి ధర
  • కొన్ని ప్రాంతాల్లో కిలో రూ. 80
  • 2 వేల టన్నుల దిగుమతికి టెండర్లు

ఆకాశాన్నంటిన ఉల్లిపాయల ధరలను కిందకు దించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండడంతో, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

More Telugu News