Sunnam Rajaiah: తాత్కాలిక డ్రైవర్ తో టీఎస్ ఆర్టీసీ బస్... త్రుటిలో తప్పించుకున్న సున్నం రాజయ్య!

  • తూ.గో జిల్లా వీఆర్ పురంలో ఘటన
  • బైక్ పై వస్తున్న సున్నం రాజయ్య
  • అప్రమత్తంగా ఉండటంతో తప్పిన ప్రమాదం

టీఎస్ ఆర్టీసీ బస్సును నడుపుతున్న ఓ తాత్కాలిక డ్రైవర్, అతి వేగంతో దూసుకు రాగా, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా వీఆర్ పురం సమీపంలో జరిగింది.

 స్థానిక సీపీఎం నేత బొప్పెన కిరణ్ తో కలిసి సున్నం రాజయ్య బైక్ పై వస్తూ, శబరి నదిపై నిర్మించిన వంతెన పైకి చేరుకున్న వేళ, ఎదురుగా అత్యంత వేగంగా బస్సు దూసుకు వచ్చింది. అది తనపైకే వస్తుందని భావించిన కిరణ్, వెంటనే బైక్ కు బ్రేక్ వేసి, రోడ్డు కిందకు దింపాడు. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం వీఆర్ పురంలో బస్సును ఆపిన స్థానికులు డ్రైవర్ ను మందలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి, మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని డ్రైవర్ కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

More Telugu News