Anantapur District: హతవిధీ...గుప్త నిధుల కోసం ఆలయంలో చోరీ

  • నిధి కోసం శ్రీకృష్ణుడి విగ్రహం తొలగించే యత్నం
  • గ్రామస్థులు గమనించడంతో పరారీ
  • అనంతపురం జిల్లాలో ఘటన

స్వామి కష్టాలు నెరవేర్చు...అష్టయిశ్వర్యాలు ప్రసాదించు అని ఎవరైనా దేవుడిని వేడుకుంటారు. ఇదంతా లాంగ్‌ ప్రాసెస్‌ అనుకున్నారేమో, షార్ట్‌ కట్‌లో నిధులు కొట్టేసేందుకు గుడిలోని విగ్రహ మండపాన్నే తవ్వేశారు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కళ్యాణ దుర్గం మండలం తూర్పు కోడిపల్లిలో శ్రీకృష్ణాలయం ఉంది. ఈ ఆయంలో ప్రతిష్ఠించిన కృష్ణుని విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయన్నప్రచారం స్థానికంగా ఉంది. ఈ నమ్మకంతో కొందరు దుండగులు నిధులపై కన్నేశారు. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించారు. విగ్రహాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్థులు రావడంతో అలాగే వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనమైంది.

More Telugu News