Krishna District: మచిలీపట్నంలో దారుణం... పుట్టిన బిడ్డను తల్లి వదిలేసి వెళితే... చెత్తకుప్పలో పడేసిన డాక్టర్, నర్స్!

  • పుట్టిన మరుసటి రోజే వదిలేసి వెళ్లిన తల్లి
  • చెత్తకుప్పలో వేసిన ఆసుపత్రి సిబ్బంది
  • అరెస్ట్ చేసిన పోలీసులు

తనకు పుట్టిన బిడ్డ భారమవుతుందని భావించిన ఓ తల్లి, కళ్లు తెరవని పసిగుడ్డును వదిలేసి వెళ్లగా, ఏ మాత్రం కనికరం చూపని ఓ ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్, నర్స్, చిన్నారిని చెత్తకుప్పలో పడేశారు. ఇంత ఘోరానికి పాల్పడిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ ప్రసవించింది. మరుసటి రోజు బిడ్డను ఆమె వదిలేసి వెళ్లిపోయింది.

నర్సింగ్ హోమ్ డాక్టర్ ధన్వంతరి శ్రీనివాసాచార్య, ఏఎన్ఎం బేబీ రాణిలు కలిసి, ఆ బిడ్డను దగ్గర్లోనే ఉన్న శ్రీ వెంకటేశ్వరాలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో పడేశారు. బిడ్డను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి, ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డను తరలించినా, పాప ప్రాణాలు దక్కలేదు. ఈ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్, నర్స్ లను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News