narayanadri express: రైలు ప్రయాణికులకు గమనిక.. మారిన 'నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్' వేళలు

  • లింగంపల్లి నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరనున్న రైలు
  • సాయంత్రం  6:15 గంటలకు సికింద్రాబాద్
  • ఈ నెల పదో తేదీ నుంచే కొత్త వేళలు అమలు

లింగంపల్లి నుంచి గుంటూరు మీదుగా తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు వేళలను మారుస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల పదో తేదీ నుంచి ఈ రైలు సాయంత్రం 5:30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరుతుందని సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు. 5:50 గంటలకు బేగంపేట, 6:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. బీబీనగర్‌ 6:49 గంటలకు, 7:30 గంటలకు రామన్నపేట, 7:40కి చిట్యాల, 8 గంటలకు నల్గొండ చేరుకునే రైలు.. 9:47కు సత్తెనపల్లి, 11 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వివరించారు. ఈ నెల పదో తేదీ నుంచే ఈ వేళలు అమల్లోకి వస్తాయని, ప్రయాణికులు గుర్తించాలని కోరారు.

More Telugu News