Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో నదిలో పడిన బస్సు.. ఆరుగురి దుర్మరణం

  • అదుపుతప్పి రైసేన్ నదిలో పడిన బస్సు
  • 19 మందికి తీవ్ర గాయాలు
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు గత అర్ధ రాత్రి అదుపుతప్పి కింద ఉన్న రైసేన్‌నదిలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News