Huzur Nagar: హుజూర్ నగర్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తి

  • బరిలో నిలిచిన 31 మంది అభ్యర్థులు
  • వివిధ కారణాలతో 45 నామినేషన్ల తిరస్కరణ
  • తిరస్కరణకు గురైన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్

తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయింది. హుజూర్ నగర్ బరిలో 31 మంది అభ్యర్థులు నిలిచారు. సంతకం, ఫారం-2 తప్పులు, డిపాజిట్లు చెల్లించకపోవడం వంటి కారణాలతో 45 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ రావు నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. అటు, సీపీఎం అభ్యర్థి పోటీలో లేకపోవడంతో తమ మద్దతు టీఆర్ఎస్ కేనని సీపీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News