Banks: నేటి నుంచి అన్ని బ్యాంకులకు ఒకే రకమైన పనివేళలు

  • ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు 
  • మధ్యాహ్నం 2:00-2:30 మధ్య భోజన విరామం
  • రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళలు నేటి నుంచి మారనున్నాయి. ఇక నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ నేటి నుంచి ఇదే సమయ పాలనను పాటిస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. ఇక, ప్రతి ఆదివారంతోపాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులు యథావిధిగా మూతపడతాయి.

More Telugu News