Telugudesam: పులివెందులలో వాహనం దగ్ధం కేసులో టీడీపీ నేతల అరెస్ట్

  • నెలరోజుల కిందట టీడీపీ ఆఫీసులో వాహనం దగ్ధం
  • పోలీసులకు ఫిర్యాదు
  • టీడీపీ నేతలే దగ్ధం చేశారంటున్న పోలీసులు

కడప జిల్లా పులివెందులలో కొన్నిరోజుల క్రితం టీడీపీ ఆఫీసులో వాహనం దగ్ధమైనట్టు ఫిర్యాదు అందింది. ఈ కేసును విచారించిన పోలీసులు టీడీపీ నేతలే వాహనాన్ని దహనం చేసినట్టు వెల్లడైందని తెలిపారు. ఈ మేరకు టీడీపీ నేతలు మధుసూదన్ రెడ్డి, మహబూబ్ బాషాలను అరెస్ట్ చేశారు. అరెస్టుకు నిరసనగా పీఎస్ వద్ద టీడీపీ నేతల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

More Telugu News