Chiranjeevi: "ఇంతకీ మీరే పార్టీలో ఉన్నారు?" అన్న ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన సమాధానం ఇదే!

  • సైరా ప్రమోషన్ ఈవెంట్లతో చిరు బిజీ
  • ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడి
  • బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి, నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. అక్టోబరు 2న వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉంది. దసరా కానుకగా వస్తున్న సైరా అనేక భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే చిరంజీవి చెన్నై, ముంబై వంటి నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

సినిమా సంగతులు పూర్తయిన తర్వాత, రాజకీయాల గురించి మీడియా ప్రతినిధి చిరంజీవిని ప్రశ్నించారు. ఇంతకీ మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? అని మీడియా ప్రతినిధి చిరంజీవిని అడగ్గా, నేనిప్పుడు ఉన్నది సినిమా పార్టీలో అంటూ నవ్వేశారు. సైరా వంటి భారీ చారిత్రక చిత్రం పూర్తవడంతో ఎంతో రిలాక్స్ డ్ గా ఉన్నానని చిరు వెల్లడించారు. ఇక, తాను బీజేపీలో చేరనున్నట్టు వస్తున్న వార్తలను చిరంజీవి ఖండించారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు.

More Telugu News