Vizag: విశాఖ-అరకు మధ్య ప్రత్యేక రైలు

  • అరకు సందర్శనకు పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య
  • అక్టోబర్ 1-డిసెంబర్ 31 వరకూ ప్రత్యేక రైలు
  • ఆయా రోజుల్లో ఈ రైలు నడుస్తుందన్న రైల్వే అధికారి 

విశాఖపట్టణం జిల్లాలోని సుందర ప్రదేశం అరకును సందర్శించేందుకు పర్యాటకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైలును నడపాలని తూర్పు కోస్తా రైల్వే నిర్ణయించింది. అక్టోబర్ 1 నుంచి విశాఖ-అరకు మధ్య ఈ రైలు నడపనుంది. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు డిసెంబర్ 31 వరకూ ఆయా రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు వాల్తేరు సీనియర్ డీసీఎం సునీల్ కుమార్ ఒక ప్రకటన చేశారు.

More Telugu News