KK Birla: సరస్వతి సమ్మాన్-2019 పురస్కారం అందుకున్న సుప్రసిద్ధ కవి శివారెడ్డి

  • శివారెడ్డి పద్య సంకలనం ‘పక్కకు ఒత్తిగిలితే’
  • ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా శివారెడ్డికి పురస్కారం  
  • ప్రతి ఏటా కేకే బిర్లా ఫౌండేషన్ ఇచ్చే పురస్కారం ‘సరస్వతి సమ్మాన్’

సరస్వతి సమ్మాన్-2019 పురస్కారాన్ని సుప్రసిద్ధ కవి శివారెడ్డి అందుకున్నారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా శివారెడ్డిని శాలువాతో సత్కరించారు. శివారెడ్డి రాసిన ‘పక్కకు ఒత్తిగిలితే’ పద్య సంకలనానికి గాను ఆయనకు ఈ విశేష పురస్కారం దక్కింది.

కాగా, దేశంలోని 22 ప్రధాన భాషల్లో పద్య, వచన సాహిత్యంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి కేకే బిర్లా ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ పురస్కారాలను అందజేసింది. నిన్న ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శివారెడ్డికి ఈ పురస్కారం అందజేయడం తనకు సంతోషంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.

More Telugu News