Bellamkonda: వేశ్య పాత్రలో పాయల్ రాజ్ పుత్

  • తెరపైకి 'టైగర్ నాగేశ్వర్రావు' బయోపిక్ 
  • పూర్తయిన కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

కుర్రకారుకి ఇప్పుడు కుదురులేకుండా చేస్తోన్న కథానాయికల జాబితాలో పాయల్ రాజ్ పుత్ ముందువరుసలో కనిపిస్తోంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమా తరువాత ఈ సుందరి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు నాలుగు సినిమాలు వున్నాయి .. అందులో ఒకటిగా 'టైగర్ నాగేశ్వర్రావు' కనిపిస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో పాయల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమె ఓ వేశ్యగా కనిపించనున్నట్టుగా సమాచారం. ఈ పాత్రలో ఆమె చాలా బోల్డ్ గా వుంటుందట. 1980 - 90 దశకాల్లో స్టూవర్ట్ పురం గజదొంగగా జనాలను భయపెట్టిన 'టైగర్ నాగేశ్వర్రావు' బయోపిక్ ఇది. వంశీకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. 'టైగర్ నాగేశ్వర్రావు'గా బెల్లంకొండ చేసే దొంగతనాలకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

More Telugu News