చంద్రబాబుకు మతిమరపొచ్చిందేమో!: ఎమ్మెల్యే రోజా విసుర్లు
- బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసింది జగన్ ప్రభుత్వం
- టీడీపీ హయాంలో రద్దు చేశారనడం కరెక్టు కాదు
- బాబుని ఏ పిచ్చాసుపత్రిలో చేర్చాలో ప్రజలే ఆలోచించాలి
ఏపీలో పిచ్చి తుగ్లక్ పాలన నడుస్తోందని పిచ్చి పిచ్చి మాటలు ఆయన మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో మాట ఇచ్చిన ప్రకారమే ఐదు జీవోలను రద్దు చేశారని అన్నారు. ఈ జీవోలను రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు, తమ హయాంలోనే చేశామని చెబుతున్న చంద్రబాబునాయుడుని ఏ పిచ్చాసుపత్రిలో జాయిన్ చెయ్యాలో ప్రజలే ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని విమర్శించారు. చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేస్తున్న పిచ్చి వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పకపోవడంతో వీళ్లకు పిచ్చెక్కి పోతున్నట్టు ఉందని అన్నారు.