Vishaka manyam: విశాఖ మన్యం బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు

  • బాక్సైట్ తవ్వకాలకు అనుమతించిన గత ప్రభుత్వం 
  • రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ 
  • ఈ అనుమతులను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

విశాఖ మన్యం బాక్సైట్ తవ్వకాలకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ముప్పై ఏళ్లపాటు ఏపీ ఎండీసీకి ఇచ్చిన అనుమతులు రద్దు అవుతాయి. ఈ ఉత్తర్వులతో మొత్తం 2,226 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు కానున్నాయి. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, చింతల జెర్రెల బ్లాక్ 1,2,3, గాలికొండ, చిత్తమగొంది, రక్తకొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ అనుమతులు రద్దు అవుతాయి. కాగా, ఈ విషయమై ఎన్నికలకు ముందు గిరిజనులకు వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News