Godavari: గల్లంతైనవారి కోసం గాలింపు జరుపుతుండగా.. బోల్తా కొట్టిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బోటు!

  • గోదావరిలో గల్లంతైన వారికోసం గాలింపు జరుపుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
  • భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఎన్టీఆర్ఎఫ్ బోటు బోల్తా
  • సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న సిబ్బంది

గోదావరి నదిలో ఈరోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు జరుపుతున్న ఎన్డీఆర్ఎఫ్ బోటు బోల్తా కొట్టింది. దేవీపట్నం మండలం మంటూరు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా... భారీ వర్షం, ఈదురుగాలుల వల్ల బోటు పల్టీ కొట్టింది. అయితే, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది బోటుతో సహా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News