Yerapatineni: యరపతినేనిపై ఆరోపణల కేసు: కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ ప్రభుత్వం

  • యరపతినేనిపై మైనింగ్ తవ్వకాల ఆరోపణలు
  • సంబంధిత వివరాలతో కేంద్రానికి నివేదిక
  • సీబీఐతో విచారణ జరిపించాలని కోరిన ఏపీ సర్కార్

మైనింగ్ తవ్వకాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో సీఐడీ విచారణ పూర్తయింది. ఇందుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను సీబీఐకు అందజేసినట్టు సమాచారం. ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి పునరుద్ధరించిన తర్వాత ఆ శాఖకు అప్పగించిన తొలి కేసు ఇది.

More Telugu News