Laila: 'ఎగిరే పావురమా' ఒక తీపి జ్ఞాపకం: నాటి హీరోయిన్ లైలా

  • 'ఎగిరే పావురమా'లో చేసిన పాత్ర గొప్పది  
  • షూటింగు జరిగిన రోజులను మరిచిపోలేను 
  • ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా గుర్తున్నారన్న లైలా

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో 'లైలా' ఒకరు. 'ఎగిరే పావురమా' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన 'లైలా' .. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు. స్రవంతి రవికిశోర్ గారు 'ఎగిరే పావురమా' సినిమా కోసం నన్ను తీసుకున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ - జేడీ చక్రవర్తి హీరోలని చెప్పారు.

అప్పటికి నాకు జేడీ చక్రవర్తిగారు తెలుసునుగానీ, శ్రీకాంత్ గారు తెలియదు. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డిగారు నా పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఆ సినిమా షూటింగు ఎంతో సరదాగా జరిగింది .. అదో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా ఇప్పటికీ నా కుటుంబ సభ్యులుగానే అనిపిస్తుంటారు. తెలుగులో ఇంతమంచి చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం కావడం నా అదృష్టంగా అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చింది.

More Telugu News