MS Dhoni: కొత్త వాహనంలో ధోనీ షికార్లు... వైరల్ అవుతున్న ఫొటో!

  • ధోనీ ఇంట కొత్త కారు సందడి
  • ధోనీ కోసం కొత్త వాహనం కొనుగోలు చేసిన సాక్షి
  • 'జీప్ చెరోకీ' ఖరీదు రూ.1.12 కోట్లు

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ గ్యారేజ్ లో కొత్త వాహనం చేరింది. ఇటీవల ధోనీ కశ్మీర్ లోయలో మిలిటరీ విధులు నిర్వర్తించడం తెలిసిందే. ఆ సమయంలో ధోనీ భార్య సాక్షి 'జీప్ చెరోకీ' వాహనాన్ని కొనుగోలు చేసింది. తన భర్తకు కానుకగా ఇచ్చేందుకు 'జీప్' వాహనాన్ని తన ఇంటికి తీసుకువచ్చింది. కశ్మీర్ లోయలో విధులు పూర్తి చేసుకుని వచ్చిన ధోనీ తాజాగా తనకెంతో ఇష్టమైన 'జీప్' లో షికార్లు కొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'జీప్ చెరోకీ' వాహనం ఖరీదు రూ.1.12 కోట్లు. ధోనీకి కార్లు, బైకులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

More Telugu News