Sivaprasad: శివప్రసాద్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు

  • టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ మృతి
  • శివప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చిన టీడీపీ అధినేత
  • శివప్రసాద్ తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు

మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ అనారోగ్యంతో ఈ రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, శివప్రసాద్ కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. శివప్రసాద్ అర్ధాంగి విజయలక్ష్మితో ఫోన్ లో మాట్లాడిన ఆయన ఓదార్పు వచనాలు పలికారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. సినీ, రాజకీయ రంగాల్లో శివప్రసాద్ రాణించారని కొనియాడారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

More Telugu News