Andhra Jyothy: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి

  • రాధాకృష్ణను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్
  • సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భేటీ
  • ఆర్టికల్ 370 రద్దుకు గల కారణాలను వివరించిన వైనం

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల అధినేత రాధాకృష్ణను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. హైదరాబాదులోని రాధాకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు గల కారణాలను ఈ సందర్భంగా రాధాకృష్ణకు ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంలో దేశంలోని ప్రముఖులను కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ఎండీని కేంద్ర మంత్రి కలిశారు.

More Telugu News