‘సర్దార్ పటేల్ జాతీయ సమైక్యత’ అవార్డును తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం!
- దేశ సమగ్రత, సమైక్యత కోసం కృషిచేసిన వారికి ప్రదానం
- ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర హోంశాఖ
- అవార్డు గ్రహీతల పేర్లు గెజిట్ ద్వారా ప్రకటన
ఈ పురస్కారానికి ఎంపికైనవారి పేర్లను ప్రభుత్వం గెజిట్ ద్వారా ప్రకటించనుంది. గుజరాత్ లోని కేవదియాలో ఇటీవల జరిగిన డీజీపీ, ఐజీ వార్షిక సమావేశంలో పాల్గొన్న మోదీ, సర్దార్ పటేల్ పేరుతో సమైక్యతా పురస్కారాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగానే కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.