Indonesia: ఇండోనేషియాను కుదిపేసిన వరుస భూకంపాలు.. రిక్టర్ స్కేలుపై 6.2 నమోదు!

  • జావా, బాలీ ద్వీపాల్లో ప్రకంపనలు
  • కంపించిన భవనాలు
  • భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఇండోనేషియా దేశాన్ని ఈ రోజు వరుస భూకంపాలు వణికించాయి. ఇండోనేషియాలోని బాలీ, జావా ద్వీపాలపై రెండు భూకంపాలు విరుచుకుపడ్డాయి. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపం తీవ్రతకు రెండు నగరాల్లోని పలు భవనాలు కంపించాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

పుర్వడోయి ప్రాంతానికి ఈశాన్యాన 148 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని ఇండోనేషియా విపత్తు నిర్వహణ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఎంత ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందో ఇంకా స్పష్టత రాలేదన్నారు. భూంకంపం నేపథ్యంలో తాము సునామీ హెచ్చరికలు జారీచేయలేదని స్పష్టం చేశారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుపుతామని పేర్కొన్నారు.
Indonesia
Earthquake
6.2
Impact

More Telugu News