Andhra Pradesh: మరికాసేపట్లో.. ‘గ్రామ సచివాలయం’ ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్న సీఎం జగన్!

  • క్యాంపు కార్యాలయంలో విడుదల చేయనున్న జగన్
  • హాజరుకానున్న మంత్రులు, ఉన్నతాధికారులు
  • ఈ నెల 1-8 తేదీల మధ్య జరిగిన పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల 1 నుంచి 8 వరకూ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్, మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో 1.26 లక్షలకుపైగా గ్రామ సచివాలయం ఉద్యోగాలను జగన్ ప్రభుత్వం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News