అమరావతిలో వర్షాలు.. ఏపీ హైకోర్టు భవనంలోకి చేరిన నీరు!
- సీలింగ్ నుంచి నీటి ధార
- నీటిని ఎత్తిపోస్తున్న సిబ్బంది
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బకెట్లతో నీటిని తోడి బయటపోశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినకుండా వాటిని లీకేజీ లేని ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయం తరహాలోనే తాత్కాలిక హైకోర్టును కూడా నిర్మించారనీ, నాణ్యత పాటించలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.