Chitthuru Nagayya: అక్కినేని దగ్గర అప్పు చేసిన చిత్తూరు నాగయ్య!

  • నిర్మాతగా నాగయ్య గారు నష్టపోయారు 
  • దాన ధర్మాల వలన ఆస్తులు కరిగిపోయాయి 
  • ఏదీ దాచుకోకుండా చెప్పేసేవారన్న జర్నలిస్ట్ ఈశ్వర్

చెన్నైలో విజయచిత్ర పత్రికలో పనిచేసిన బీకే ఈశ్వర్, తాజాగా చిత్తూరు నాగయ్యతో తనకి గల పరిచయాన్ని గురించి ప్రస్తావించారు. "విజయచిత్ర పత్రికలో నాగయ్య గారి జీవితకథను సీరియల్ గా ప్రచురించడం జరిగింది. ఆ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తోన్న నేను, ఆ విషయంపై ఆయనను కలుస్తూ ఉండేవాడిని.

సినిమాల నిర్మాణం కారణంగా .. దానధర్మాల కారణంగా చిత్తూరు నాగయ్యగారి ఆస్తిపాస్తులు తరిగిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో తాను అక్కినేని నాగేశ్వరరావుగారి దగ్గర ఒక వేయి రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు చిత్తూరు నాగయ్యగారు చెప్పారు. ఆ తరువాత ఆ డబ్బును తిరిగి ఇవ్వబోతే నాగేశ్వరరావు గారు తీసుకోలేదని కూడా చెప్పారు. తన జీవితకథలో ఈ విషయం కూడా రాయమని అన్నారు. ఇలా ఉన్నదున్నట్టుగా ఆయన అన్ని విషయాలు చెప్పేసేవారు. ఈ విషయాలు చదివి అప్పట్లో చాలామంది బాధపడ్డారు" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News