సరిహద్దులో పాక్ మహాకుట్ర.. ‘బ్యాట్’ దళ సభ్యులను కాల్చిచంపిన భారత్.. వీడియో!
- భారత ఆర్మీ లక్ష్యంగా బ్యాట్ ఆపరేషన్
- బ్యాట్ లో పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు
- అందర్నీ మట్టుబెట్టిన భారత సైన్యం
భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న బ్యాట్ బృందం సభ్యులను కాల్చిచంపాయి. ఈ నెల 12-13 తేదీల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్మీ తాజాగా విడుదల చేసింది. గతంలో భారత్ లోకి వచ్చిన పాక్ బ్యాట్ దళాలు కొంతమంది ఆర్మీ జవాన్ల తలలు నరికి తీసుకెళ్లాయి. ఈసారి కూడా అలాగే చేద్దామనుకున్న పాకిస్థాన్ కు భారత్ దీటైన జవాబు ఇచ్చింది.