Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తాజ్ మహల్ ను సందర్శించిన కాజల్ 
  • భారీ రేటుకి 'సైరా' శాటిలైట్ హక్కులు
  • రాజమహేంద్రవరం జైలులో 'భారతీయుడు 2' 

*  ఆగ్రాలోని తాజ్ మహల్ ను తొలిసారిగా ఇప్పుడే చూశానని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'తండ్రితో కలసి ఈ చారిత్రక సౌందర్యాన్ని వీక్షించానని, ఆ అందాన్ని చూసి మాటలు రాలేదని సోషల్ మీడియాలో కాజల్ పోస్ట్ పెట్టింది.  
*  చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రానికి బిజినెస్ పరంగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం అన్ని భాషల శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులను జీటీవీ సొంతం చేసుకుంది. ఇందుకుగాను 125 కోట్లను జీటీవీ చెల్లించినట్టు సమాచారం.
*  కమలహాసన్ కథానాయకుడుగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భారతీయుడు 2' చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ రాజమహేంద్రవరంలో మొదలైంది. అక్కడి చారిత్రాత్మక సెంట్రల్ జైలులో ప్రస్తుతం కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నాడు.

More Telugu News