Nikhl: వచ్చేనెలలో సెట్స్ పైకి 'కార్తికేయ 2'

  • గతంలో వచ్చిన 'కార్తికేయ' హిట్ 
  • సీక్వెల్ కి జరుగుతోన్న సన్నాహాలు 
  • వచ్చేనెల 2వ వారంలో షూటింగ్ మొదలు  

నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో 'కార్తికేయ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నేపథ్యంలో సాగే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి చందూ - నిఖిల్ రంగంలోకి దిగారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ - వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు.

ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అక్టోబర్ 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా 'శ్రుతి శెట్టి'ని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదనేది తాజా సమాచారం. కథానాయిక ఎవరనేది త్వరలోనే తెలియజేస్తారట. కొంతకాలంగా సక్సెస్ కి దూరమైన చందూ - నిఖిల్ ఇద్దరూ కూడా 'కార్తికేయ 2'తో మళ్లీ హిట్ కొడతారేమో చూడాలి.

More Telugu News