Kodela siva prasad: ఈ పరిస్థితుల్లో నేనేమీ మాట్లాడలేను: కోడెల శివరామ్

  • విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కోడెల కొడుకు
  • గన్నవరం విమానాశ్రయం చేరుకున్న శివరామ్ 
  • తండ్రిని కోల్పోయిన శివరామ్ కు ఓదార్పు

విదేశీ పర్యటనలో ఉన్న కోడెల తనయుడు శివరామ్ కొద్ది సేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు ఆయన్ని ఓదార్చారు. అక్కడి నుంచి నరసరావుపేటకు శివరామ్ బయలుదేరారు. ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘మా కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ పరిస్థితుల్లో నేనేమీ మాట్లాడలేను' అన్నారు. కాగా, కోడెల పార్థివదేహం తరలింపు ప్రక్రియ వర్షం మధ్యే కొనసాగుతోంది. నందిగామలో జోరువానలోనూ కోడెల పార్థివదేహానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు.

More Telugu News