Kodela: కోడెల ఉరేసుకుని చనిపోయారు... పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి!

  • మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం
  • ఉస్మానియా ఆసుపత్రిలో శవపరీక్ష
  • మెడపై తాడు బిగించుకున్న ఆనవాళ్లు గుర్తించిన వైద్యులు

టీడీపీ అగ్రనేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉరేసుకుని చనిపోయినట్టు డాక్టర్లు స్పష్టం చేశారు. కోడెల భౌతిక కాయానికి ఉస్మానియా ఆసుపత్రిలో ఈ సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కోడెల ఉరేసుకోవడం కారణంగానే చనిపోయినట్టు నిర్ధారించారు. మెడపై తాడు బిగించుకున్న గుర్తులు కూడా ఉన్నట్టు శవపరీక్షలో తేలింది.

More Telugu News