కోడెల శివప్రసాదరావు మృతి పట్ల సంతాపం తెలియజేసిన సీఎం జగన్
- కోడెల మరణంపై ఏపీ సీఎం స్పందన
- కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
- ట్వీట్ చేసిన సీఎంఓ
విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్ గా వ్యవహరించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తోంది. దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కోడెల మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన జగన్ సంతాపం ప్రకటించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వెలువడింది.