Kodela sivaprasad: వ్యక్తిగతంగా ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయాను: యనమల ఆవేదన

  • కోడెల చివరి శ్వాస వరకూ పార్టీ కోసం పరితపించారు
  • వైసీపీ ప్రభుత్వం ఆయన్ని వేధించింది
  • అందువల్లే ఆత్మహత్య చేసుకున్నారు

కోడెల శివప్రసాద్ చివరి శ్వాస వరకూ పార్టీ కోసం పరితపించారని యనమల రామకృష్ణుడు అన్నారు. వ్యక్తిగతంగా ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కోడెల కుటుంబానికి తన సంతాపం తెలిపారు. కోడెల మృతిపై మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావులు సంతాపం వ్యక్తం చేశారు.

More Telugu News