Devineni Uma: మీ అవినీతి, అసమర్థతలు బయటపడతాయని టీవీ చానళ్ల ప్రసారాలు నిలిపివేస్తారా?: దేవినేని ఉమ
రాష్ట్రంలో రెండు వార్త చానళ్ల ప్రసారాలను నిలిపివేశారంటూ టీడీపీ నేతలు వైసీపీపై మండిపడుతున్నారు. అధినేత చంద్రబాబు ఇప్పటికే ఈ విషయంలో ఘాటుగా స్పందించగా, తాజాగా సీనియర్ నేత దేవినేని ఉమ కూడా విమర్శలు చేశారు. మీ అవినీతి, అసమర్థతలు బయటపడతాయని భయపడి టీవీ చానళ్ల ప్రసారాలు నిలిపివేస్తారా? అంటూ మండిపడ్డారు. బెజవాడలో వైసీపీ మంత్రులు ఎంఎస్ఓలను బెదిరించారని ఆరోపించారు. ఇదేమన్నా రాచరికం అనుకుంటున్నారా అని నిలదీశారు. మీడియా స్వేచ్ఛను కాలరాయాలని చూడడం దారుణమని ఉమ అభిప్రాయపడ్డారు.