Andhra Pradesh: ఏపీ రెవెన్యూ కాస్త ఆందోళనకరంగా ఉంది: నీతి అయోగ్ వైస్ చైర్మన్ వెల్లడి

  • సీఎం జగన్ తో నీతి అయోగ్ బృందం భేటీ
  • పలు అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర అధికారులు
  • అనేక సూచనలు చేసిన నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్

ఏపీ సచివాలయంలో ఈ మధ్యాహ్నం నీతి అయోగ్ బృందం ఏపీ సీఎం జగన్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు ఏపీ అధికారులు వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పలు రంగాల వారీగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. భేటీ అనంతరం నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర రెవెన్యూ కాస్త ఆందోళనకరంగా ఉందని, బడ్జెట్ ను దాటి ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయని వెల్లడించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు, పబ్లిక్ రుణాలపై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని, మహిళా శిశుసంక్షేమంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (పెట్టుబడి రహిత ప్రకృతి వ్యవసాయం)ను ప్రోత్సహించాలని రాజీవ్ కుమార్ సూచించారు. నవరత్నాలు పథకాలపై సీఎం వివరించారని తెలిపారు. సీఎం జగన్ ఆలోచన, విజన్, ప్రణాళికలు చాలా బాగున్నాయంటూ ఆయన కితాబిచ్చారు.

అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుండేలా తోడ్పాటు అందిస్తామని, మానవాభివృద్ధి సూచికలను మరింత పెంచేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్ లో సగానికి పైగా మానవ వనరుల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News